Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటిలాగే నేడు కూడా భారీ లాభాలను దండుకున్నాయి. సెన్సెక్స్ 54 వేల మార్కు, నిఫ్టీ 16 వేల మార్కు దాటడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడి ఉదయం నుంచీ మార్కెట్లలో కొనుగోళ్ల కళ కనపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ల పట్ల మదుపుదారులు మొగ్గు చూపారు. దీంతో, చివరికి సెన్సెక్స్ 546.41 పాయింట్ల లాభంతో 54,369.77 వద్ద ముగియగా.. నిఫ్టీ 128.05 పాయింట్ల లాభంతో 16,258.80 వద్ద క్లోజయింది.