Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాత నాణాలు మరియు నోట్ల క్రయవిక్రయాలపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. పాత నాణాలు లేదా నోట్లను అమ్మడం కాని లేదా కొంటామనే అసత్య ప్రచారాల బారిన పడకుండా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు, లోగోను ఉపయోగిస్తూ.. వివిధ ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా నాణేలు, పాత నోట్ల క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుంచి కమీషన్ వసూలు చేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. దాంతో ఆర్బీఐ స్పందిస్తూ.. ఆగస్టు 4న ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఇటువంటి లావాదేవీలు నిర్వహించడం లేదని, పైగా కమీషన్లు అసలే తీసుకోబోమని తేల్చి చెప్పింది. అంతేకాకుండా అటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి ఏ సంస్థ లేదా వ్యక్తికి అధికారం లేదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇటువంటి అసాంఘీక కార్యకలాపాలకు ఆర్బీఐ పేరును ఉపయోగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.