Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ జంతర్మంతర్లో నిరసన తెలుపుతున్న రైతులకు ఏపీ రైతు సంఘం ప్రతినిధులు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలన్నారు. దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతుల హామీలను నెరవేర్చలేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు తప్పుబట్టారు.