Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టుకు సెమీస్ లో నిరాశ ఎదురైంది. బుధవారం అర్జెంటీనాతో జరిగిని సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 1-2 తేడాతో పోరాడి ఓడిపోయింది. దాంతో ఇక కాంస్య పతకం కోసం బ్రిటన్తో పోరాడనుంది.
సెమీస్లో రెండో నిమిషంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి భారత్ కు మంచి ప్రారంభం ఇచ్చినా.. ఆ తర్వాత మరో గోల్ సాధించలేకపోయారు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది.