Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా పెలివియన్కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాక్ క్రాలే(27)తో కలిసి మరో ఓపెనర్ సిబ్లీ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన 21వ ఓవర్లో చివరి బంతికి జాక్ క్రాలే రిషభ్ పంత్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 66 పరుగుల వద్ద డొమినిక్ సిబ్లీ(18) షమి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 29ఓవర్లకు71 పరుగులుగా ఉంది. క్రీజులో జో రూట్ (17), బెయిర్ స్టో (1)పరుగులతో ఉన్నారు.