Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చెట్టును నరికిన ఓ వ్యక్తికి గ్రామ పంచాయతీ అధికారులు జరిమానా విధించిన సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాంసాగర్లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగుల లచ్చయ్య అనే వ్యక్తి గ్రామంలోని ఓ పచ్చని చెట్టును అకారణంగా నరికి వేయడంతో అతనికి గ్రామ పంచాయతీ రూ.1000 జరిమానా విధించినట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
ప్రభుత్వం ఓ వైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతుండగా కొంతమంది పచ్చని చెట్లను నరికి వేయడం సరికాదని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. అనుమతి లేకుండా చెట్లను నరికి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.