Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడిన వారిలో 594 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,47,229కి చేరాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,34,612 మంది కోలుకున్నారు. ఇంకా 8,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3,814కు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,12,796 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.