Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ని కలసి వినతిపత్రం అందించడానికి వెళ్తున్న ఎస్.ఎఫ్.ఐ./డి.వై.ఎఫ్.ఐ. నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసులు, టిఆర్ఎస్ నాయకులు విద్యార్ధి,యువజన నాయకులపై పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు.
ఈ ఘటనను ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. గత అనేక సంవత్సరాలుగా మేడ్చల్ కేంద్రంలో డిగ్రీ కళాశాల డిమాండ్ ఉంది.విద్యార్థులు,అనేక సంవత్సరాలుగా కళాశాల ఏర్పాటు కోసం పోరాడుతున్నారు. ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన కళశాలలో కూడా మేడ్చల్ లో కళాశాల ఏర్పాటు గురించి ప్రస్థావన లేదు.హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి తన విద్యాసంస్థలు పెంచుకుంటున్నాడు తప్ప ప్రభుత్వ విద్యార్ధులు కోసం విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం లేదు. మంత్రులు పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇచ్చి అడగడం కోసం వెళ్ళిన నాయకులను ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీసులు దాడి చేశారు. టిఆర్ఎస్ నాయకులు కూడా విద్యార్ధి,యువజన నాయకులపై దాడి చేశారు. వెంటనే మేడ్చల్ కళాశాల ఏర్పాటు చేయాలి. లేకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాని హెచ్చరించారు. ఎస్.ఎఫ్.ఐ. డి.వై.ఎఫ్.ఐ. నాయకులపై దాడిని విద్యార్ధులు, విద్యావేత్తలు, మేధావులు ఖండించాలని ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్ష్యా, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు లు తెలిపారు.