Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేఆర్ఎంబీ బృందం పర్యటన వాయిదా పడింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో గురువారం పర్యటిస్తామని కేఆర్ఎంబీ బృందం ముందే ప్రకటించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకే కేఆర్ఎంబీ బృందం ఈ పర్యటనను వాయిదా వేసుకుంది. కేఆర్ఎంబీ బృందంలో దేవేందర్రావు అనే తెలంగాణ వాది ఉన్నారని ఆంధ్రా అధికారులు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్లే బృందం పర్యటనను కేఆర్ఎంబీ వాయిదా వేసింది. ఎన్జీటీ ఆదేశించినప్పటికీ కేఆర్ఎంబీ సొంత బృందాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ఆంద్రా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.