Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడ్చల్: జవహార్నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చెన్నాపురం చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆర్టీసీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.