Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇల్లెందులో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ రాంబాబు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంబాబు ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల అతనిపై అతని భార్య వేధింపుల కేసు పెట్టింది. ఏడాది నుంచి విధులకు వెళ్లకుండా వేధిస్తున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్పై కేసు నమోదైంది. ఈ క్రమంలో మనస్తాపంతోనే రాంబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.