Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజేత సూపర్ మార్కెట్ వద్ద సుమారు 45 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. 15 రోజుల క్రితం ఇక్కడకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఎస్ఆర్నగర్ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేసుకుంటూ రాత్రివేళ సూపర్ మార్కెట్ ఎదుట నిద్రించేవాడు. రోజు ఉదయాన్నే లేచి వెళ్లే వ్యక్తి ఎంతకీ లేవకపోవడంతో స్థానికులు తట్టి చూశారు. అప్పటికే మరణించడంతో ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శంకర్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.