Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో నాలుగు దశాబ్దాల తర్వాత మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ హాకీ ( Hockey ) టీమ్లోని పంజాబ్ ప్లేయర్స్కు అక్కడి ప్రభుత్వం భారీ క్యాష్ప్రైజ్ ప్రకటించింది. ఒక్కో ప్లేయర్కు రూ.కోటి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు గురువారం ట్విటర్లో వెల్లడించింది. పంజాబ్ క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింత్ ట్విటర్లో ఈ ప్రకటన చేశారు. ఇండియన్ హాకీ చరిత్ర సృష్టించిన ఈ రోజున పంజాబ్ ప్లేయర్స్ ఒక్కొక్కరికి రూ.కోటి నగదు బహుమతి ప్రకటిస్తున్నాము. మీ రాక కోసం ఎదురుచూస్తుంటామని ఆయన ట్వీట్ చేశారు. ఇండియన్ హాకీ టీమ్లో మొత్తం 8 మంది పంజాబ్ ప్లేయర్స్ ఉన్నారు. కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తోపాటు హర్మన్ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, మణ్దీప్ సింగ్ ఉన్నారు. ఒకవేళ గోల్డ్ మెడల్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు ఇస్తామని పంజాబ్ గతంలోనే ప్రకటించింది.