Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పాత కరెన్సీ నోట్లు, నాణేలు కమీషనుతో విక్రయిస్తామని..కొంటామని అనధికారికంగా చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దంటూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు/ సంస్థలు రిజర్వుబ్యాంక్ పేరు, లోగోలను సైతం వాడుకొని ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్టు తమదృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆన్లైన్/ఆఫ్లైన్ మార్గాల ద్వారా పాత నోట్ల చలామణీ చేస్తూ ప్రజల నుంచి ఛార్జీలు, కమీషన్లు, పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఆర్బీఐకి ఇటువంటి వ్యవహారాలతో సంబంధం లేదని, ఇలాంటి చలామణీలకు తమ ప్రతినిధులుగా ఎవరినీ నియమించలేదని స్పష్టం చేశారు.