Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ నెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రెండు బోర్డులు.. గెజిట్ నోటిఫికేషన్లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశం గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమాచారం ఇచ్చింది.