Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరుసగా మూడో రోజు నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలలో ముగిశాయి. మొదట్లో సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనైనా ఆ తర్వాత పుంజుకుని లాభాల్లో కొనసాగాయి. రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ వంటి హెవీ వెయిట్ కంపెనీల అండతో మార్కెట్లు లాభాలు పొందాయి. దీంతో సెన్సెక్స్ 123.07 పాయింట్ల లాభంతో 54492.84 వద్ద.. నిఫ్టీ 35.80 పాయింట్ల లాభంతో 16294.60 వద్ద ముగిశాయి.