Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ శ్రేణి కలిగిన సంస్థ వండర్లా హాలీడేస్ లిమిటెడ్, తమ వండర్లా హైదరాబాద్ పార్క్ను నేటి నుంచి అంటే, 05 ఆగస్టు 2021 వ తేదీ నుంచి పునః ప్రారంభించింది. ఈ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, వండర్లా ఇప్పుడు పరిమిత కాలపు ఆఫర్ను అందిస్తుంది. దీనిలో భాగంగా పార్కును సందర్శించిన సందర్శకులు రోజంతా పూర్తి వినోదాన్ని కేవలం 799 రూపాయలకు (జీఎస్టీ తో సహా) ఆస్వాదించడంతో పాటుగా అన్ని ల్యాండ్, వాటర్ రైడ్స్నూ పొందవచ్చు. ఈ థీమ్ పార్కును గురువారం నుంచి ఆదివారం వరకూ మాత్రమే తెరిచి ఉంచుతారు. ఉదయం 11 గంటల నుంచి పార్కు తెరిచి ఉంచబడుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించడంతో పాటుగా అత్యుత్తమ ప్రక్రియలను అనుసరిస్తున్న వండర్లా, సందర్శకులు తమ ప్రవేశ టిక్కెట్లను ముందుగానే bookings.wonderla.com వద్ద బుక్ చేసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వంతో పాటుగా ఆరోగ్యమంత్రిత్వ శాఖ జారీచేసిన అవసరమైన మార్గదర్శకాలన్నీ కూడా వండర్లా హైదరాబాద్ అనుసరిస్తుంది. ఈ పార్కు 50% సామర్థ్యంతో మాత్రమే కార్యకలాపాలు సాగిస్తుంది మరియు బ్యూరో వెరిటాస్ ఇండియా నుంచి కోవ్–సేఫ్ ధృవీకరణను అందుకున్న మొట్టమొదటి అమ్యూజ్మెంట్ పార్క్గా వండర్లా నిలిచింది. శ్రీ అరుణ్ కె చిట్టిలాపిళ్లై, మేనేజింగ్ డైరెక్టర్, వండర్లా హాలీడేస్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ మా హైదరాబాద్ పార్క్ను పునః ప్రారంభిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆగస్టు 12వ తేదీన మా బెంగళూరు పార్క్ను తెరువనున్నాం. అన్ని భద్రతా చర్యలనూ అనుసరిస్తూ, మా పార్కు వద్దకు అతిథులను స్వాగతించేందుకు మేము పూర్తిగా సన్నద్ధమై ఉన్నాము. మా సిబ్బంది అందరికీ వ్యాక్సిన్లను అందించడంతో పాటుగా మాస్కులను ధరించడం తప్పని సరి చేశాము’’ అని అన్నారు. ఈ పార్క్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 సమీపంలో రావిరాల గ్రామం వద్ద ఉంది. మరిన్ని వివరాలు మరియు బుకింగ్ కోసం వెబ్సైట్ https://www.wonderla.com/ చూడడం లేదా 040–2349 0300 ; 040–2349 0333కు కాల్ చేయడం చేయవచ్చు.