Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీమ్ఇండియా రెండో రోజు శుభారంభం చేసింది. అయితే, భోజన విరామ సమయానికి ముందు ఓపెనర్ రోహిత్శర్మ (36) ఔటయ్యాడు. రాబిన్సన్ బౌలింగ్లో షాట్ ఆడబోయి సామ్కరన్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు కేఎల్ రాహుల్(48) అర్ధశతకానికి చేరువయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కన్నా భారత్ 86 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు టీమ్ఇండియా 21/0 ఓవర్నైట్ స్కోర్తో గురువారం రెండో రోజు ఆటను కొనసాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్, రాహుల్ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశారు. ఏ మాత్రం భారీ షాట్లకు వెళ్లకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ తొలి వికెట్కు 97 పరుగులు జోడించి శుభారంభం చేశారు. చివరికి రోహిత్ 37.3 ఓవర్కు పెవిలియన్ చేరాడు.