Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక షెడ్యూల్ను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సీఈవో శశాంక్ గోయల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ ఏడాది నవంబరు 1 నుంచి 30 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 9 నుంచి అక్టోబరు 31 వరకు బ్లాకు స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా పరిశీలన చేస్తారు. రెండుచోట్ల ఓటు హక్కు ఉన్న వారికి ఒక చోట ఓటును తొలగిస్తారు. అలాగే.. పోలింగ్ కేంద్రాల వారీగా రేషనలైజేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.