Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారాయణపేట: నారాయణపేట మండల అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి విద్యుదాఘాతంతో మృతి చెందింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పేట మండలం భైరంకొండ గ్రామ రైతు తన పంట పొలానికి రక్షణగా విద్యుత్తు కంచెను ఏర్పాటు చేశారు. ఆ పొలం అటవీ ప్రాంతం సమీపంలో ఉంటుంది. బుధవారం అర్ధరాత్రి అటువైపుగా వచ్చిన ఓ చిరుత పంట రక్షణకోసం వేసిన విద్యుత్తు కంచెను తాకి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం పొలానికి వెళ్లిన రైతు చిరుత మృతి చెందిందని గుర్తించినా భయంతో ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. నారాయణపేట మండలంలోని ఎక్లాస్పూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులుల సంచారం, వ్యవసాయ పొలాల వద్ద కట్టేసిన పశువులను చంపిన సంఘటనలు గత కొన్నేళ్లుగా ఉంది. ఈ విషయమై జిల్లా అటవీశాఖ అధికారి గంగారెడ్డిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విషయం తెలుసుకుంటానన్నారు.