Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం శుక్రవారం తిరుమలలో జరగనుంది. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి సమయం ఇటీవల ముగియడంతో ప్రభుత్వం టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈవో జవహర్రెడ్డిని స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా, కన్వీనర్గా అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమిస్తూ ఉత్వర్తులిచ్చిన చేసిన నేపథ్యంలో వారిద్దరూ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలురకాల కొనుగోళ్లతోపాటు వివిధ నిర్ణయాలు తీసుకోనున్నారు.