Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టోక్యో ఒలంపిక్స్లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ పతకం సాధించిన విషయం తెలిసిందే. హోరా హోరిగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పోరాడి ఓడిన రవి.. రజతం సొంతం చేసుకున్నాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రెజ్లర్ జవుర్ ఉగేవ్ చేతిలో 7-4 తేడాతో ఓడిపోయాడు. దీంతో రవికుమార్కి రజతం దక్కింది. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
రవి కుమార్ దహియా మొదటి నుండి కొనసాగించిన స్పూర్తిపై దేశం గర్వ పడుతుంది. సిల్వర్ పతకం దక్కించుకున్నందుకు ప్రధాని, రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు రవికుమార్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తన సోషల్ మీడియా ద్వారా రవి కూమర్ని ప్రశంసించారు.