Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగేపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలంలోని నాగేపూర్ గ్రామానికి చెందిన బోయిడి సతీశ్(32)కు ఫకిరాబాద్కు చెందిన పోసానితో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు కలుగక పోవడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో మూడు నెలల క్రితం పోసాని పుట్టింటికి వెళ్లి పోయింది. ఈ క్రమంలోనే భార్య కాపురానికి రావాలని కుల పెద్దల సమక్షంలో పలుమార్లు కోరినా పోసాని అందుకు ససేమిరా అనడంతో మనస్తాపం చెందిన సతీశ్ ఈ నెల 4న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. మృతుడి తండ్రి నడిపి గంగారాం ఫిర్యాదు మేరకు శవాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై తెలిపారు.