Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కొనసాగింపుపై శుక్రవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన సడలింపులతో కూడిన లాక్డౌన్ ఈనెల 9వ తేదీ ఉదయం 6 గంటలతో ముగియనుంది. అదే సమయంలో కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో, చెన్నై, కోవై, తిరుప్పూర్ సహా పలు జిల్లాల్లో ఆంక్షలు విధిస్తూ ఆయా జిల్లా నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం కానున్నట్టు సచివాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది.