Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ(ఎస్వీపీఎన్ఏ)లో శిక్షణ పూర్తిచేసుకున్న 72వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు దీక్షాంత్ సమారోహ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీక్షాంత్ సమారోహ్ సందర్భంగా శిక్షణ పొందిన 178 మంది పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పొందిన వారిలో 144 మంది ఐపీఎస్లు, 34 మంది ఫారెన్ ఆఫీసర్స్ ట్రైనీలు ఉన్నారు. 144 మంది ఐపీఎస్లలో 23 మంది మహిళలు ఉన్నారు. ఐపీఎస్లలో తెలుగు రాష్ట్రాలకు 8 మందిని కేటాయించారు. ఏపీ, తెలంగాణకు నలుగురు చొప్పున రానున్నారు.