Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: అద్భుతం సృష్టించే అవకాశాన్ని టీమ్ఇండియా వదులుకుంది. ప్లేఆఫ్ పోరులో భారత మహిళల హాకీ జట్టు ఓటమి పాలైంది. త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. బ్రిటన్తో జరిగిన పోరులో 3-4 తేడాతో పరాజయం చవిచూసింది. గెలుపు కోసం రాణి రాంపాల్ సేన ఆఖరి వరకు పోరాడింది.