Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 16,40,287 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 44,643 కొత్త కేసులు వెలుగుచూశాయి. కేసుల్లో నాలుగు శాతం మేర పెరుగుదల కనిపించింది. కేరళ, మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 9వేలమందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా మరో 464 మంది ప్రాణాలు విడిచారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4.26లక్షల మంది మహమ్మారికి బలయ్యారని శుక్రవారం కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4,14,159 మంది కొవిడ్తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.30 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. నిన్న 41వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.10 కోట్లకు చేరాయి. మరోపక్క నిన్న 57.97లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 49.5 కోట్ల మార్కును దాటింది.