Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఒలింపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు సందడి చేశారు.. శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధును, ఆమె కుటుంబసభ్యులను పండితులు వేదాశీర్వచనం చేశారు. తీర్ధ ప్రసాదాలు ఆలయ ఈఓ భ్రమరాంబ అందించారు. ఆలయ అధికారులు ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించు కున్నానని.. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానన్నారు. దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. 2024 ఒలింపిక్స్ సహా భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు. 2024లో కూడా తాను స్వర్ణం సాధించాలని ఆశా భావం వ్యక్తం చేసిం.