Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రెండో వేవ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ తేరుకునే వరకు ప్రస్తుతం ఉన్న రెపో రేటు, రివర్స్ రెపో రేటులను కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి.
గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ఈ నెల 4 నుంచి 3 రోజులు సమావేశమైన ఎంపీసీ.. మూడు రోజుల సమీక్ష అనంతరం రెపో రేటును, రివర్స్ రెపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. వ్యవసాయ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండం, అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో త్వరలోనే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు.