Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి స్థానికులు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నక్కలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే గ్రామానికి చెందిన సుభద్ర నిండు గర్భిణి. శుక్రవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రాగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కలిసి ఆటోలో ఆమెను చెన్నూరు ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. మధ్యలో లోతోర్రె వాగు పొంగడంతో అక్కడే ఆగిపోయారు. అంబులెన్స్కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. అయితే అంబులెన్సు వాగు దాటి రాలేని పరిస్థితి నెలకొంది. దాంతో స్థానికులు స్పందించి సుభద్రను స్ట్రెచర్పై వాగు దాటించి అంబులెన్సు ఎక్కించి మానవత్వం చాటుకున్నారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు మరింత ఎక్కువ అయ్యాయి. వెంటనే వైద్య సిబ్బంది మార్గంమధ్యలోనే పురుడు పోశారు. సుభద్ర పండంటి శిశువుకి జన్మనివ్వగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు.