Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో భారత అగ్రశ్రేణి రెజ్లర్ భజరంగ్ పూనియా సెమీస్కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో ఇరాన్కు చెందిన గియాసి చెకా మొర్తజాను 2-1 తేడాతో ఓడించాడు. మొదటి రౌండ్లో భజరంగ్పై 0-1 తేడాతో ప్రత్యర్థి గియాసి పైచేయి సాధించగా రెండో రౌండ్లో భజరంగ్ పుంజుకున్నాడు. ప్రత్యర్థిని పిన్డౌన్ చేసి విజయం సాధించాడు. సెమీస్లో అజర్ బైజాన్కు చెందిన అలియెవ్ హజీతో భజరంగ్ తలపడనున్నాడు. ఆ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది