Minister @KTRTRS speaking after laying foundation stone for 100MLD Sewerage Treatment Plant at Fathenagar, Hyd https://t.co/GWPfCzIuvo
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 6, 2021
Authorization
Minister @KTRTRS speaking after laying foundation stone for 100MLD Sewerage Treatment Plant at Fathenagar, Hyd https://t.co/GWPfCzIuvo
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 6, 2021
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ శుక్రవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫతేనగర్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఫతేనగర్లో 11 ఎకరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 100 ఎంఎల్డీల మురుగు నీరు శుద్ధి అయ్యే అవకాశముంది. మొత్తం రూ.317 కోట్లను మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది హైదరాబాద్కు లక్షలమంది ప్రజలు వస్తున్నారన్నారు. జనాభాకు తగ్గట్లుగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో రోజుకు 1,950 ఎంఎల్డీల మురుగునీటి ఉత్పత్తి అవుతోందని, 94 శాతం నీరు గ్రావిటీ ద్వారా మూసీలోకి వెళ్తోందని అన్నారు. నగరంలో దాదాపు 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నట్టు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్డీల మురుగునీరు శుద్ధి అవుతుందని స్పష్టం చేశారు. నాలాల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో మంచినీరు, మురుగునీరు పైప్లైన్లు కలిసిపో యాయని దాంతో మంచినీటిలో మురుగునీరు కలిసి 9 మంది మృతి చెందారని గుర్తు చేశారు.