Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో ఐదుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ బాలుడు ఉన్నారు.