Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రెజ్లింగ్ సెమీఫైనల్ లో భారత్ కు నిరాశే ఎదురైంది. రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా.. అజర్బైజాన్కు చెందిన అలియెవ్ హజీ చేతిలో 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇక బజరంగ్ కాంస్య పతకం కోసం రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ) రెజ్లర్ రషిదోవ్తో తలపడనున్నాడు. ఈ బౌట్ శనివారం మధ్యాహ్నం 3 : 15 గంటలకు జరగనుంది.