Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేశ్బాబు బర్త్డే. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నాడు. అదేంటంటే.. తన పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని ఈ సూపర్ స్టార్ కోరుతున్నాడు. ఈ మేరకు ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. తనపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు, వారు చేసే పనులు తననెంతగానో ప్రేరేపిస్తున్నాయి అని మహేశ్ అన్నారు. అయితే ఈసారి తన బర్త్డే రోజు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్కు మద్దతుగా నిలబడాలని కోరాడు. మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనను ట్యాగ్ చేయమన్నాడు. దాంతో వాటిని తాను కూడా చూస్తానని చెప్పాడు. మహేశ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహేష్ కోరికను తీరుస్తామంటున్నారు.