Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రభుత్వం పై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నదని పలువురు విమర్శించారు.
ఒలంపియన్, రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ పూనియా మాట్లాడుతూ, ఉన్న అవార్డుకు పేరు మార్పు వృథా ప్రయత్నమని అన్నారు. దీనికి బదులుగా లెజెండ్రీ క్రికెటర్ ధ్యాన్ చంద్ పేరుతో కొత్త అవార్డును ప్రకటించి ఉండొచ్చన్నారు. ధ్యాన్ చంద్కు బీజేపీ ప్రభుత్వం మొదట భారతరత్నతో గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కె.సురేష్ మాట్లాడుతూ జాతీయ అవార్డుకు బీజేపీ ప్రభుత్వం కాషాయం రంగు పులుముతోందన్నారు.2 1వ శతాబ్దంలో దేశాన్ని నడిపిన ప్రధాని రాజీవ్ గాంధీ అని, ఆయన క్రీడలు, యువతను ప్రోత్సహంచారన్నారు.
మొతోరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంగా మార్చారని, ఇప్పుడు రాజీవ్ అవార్డు పేరు మార్పు నిర్ణయం తీసుకుందని డిజిటల్ కమ్యూనికేషన్స్ అండ్ సోషల్ మీడియా కాంగ్రెస్ జాతీయ కన్వీనర్ గౌరవ్ పాంధి అన్నారు. రైతుల ఉద్యమం, పెగాసస్ విషయం, నిత్యావసర సరుకుల ధరల పెంపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మోడీ ప్రభుత్వం, కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.