Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తన ఇద్దరు కన్న పిల్లలను గొంతునులిమి చంపిందో తల్లి. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో నివాసముండే జ్యోత్స్నకు ఇద్దరు పిల్లలు..దేవాన్ష్(6), రుద్రాంష్(4). కొంత కాలంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. అలాగే కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. దాంతో ఆ తల్లి మనస్తాపం చెందింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలకు పారాసిటమాల్ మాత్రలు వేసింది. అనంతరం ఇద్దరు పిల్లలన గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత సంగారెడ్డి శివారులోని మహబూబ్ సాగర్ చెరువు వద్దకు వెళ్లి చెరువులో దూకుతున్నట్టు భర్తకు వీడియో పంపింది. అయితే స్థానికులు సమాచారంతో పోలీసులు చెరువులో దూకిన జ్యోత్స్నను కాపాడారు. చిన్నారుల మృతదేహాలు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.