Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా ప్రభుత్వం పదో తగరతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించారు. 2020-21 ఫలితాలు, గ్రేడ్లతో పాటు 2019-20 గ్రేడ్లు కూడా ప్రకటించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి ఫలితాలు, మార్కుల మెమోలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేడ్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారని, హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా.. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని తెలిపారు. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.