Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,11,226 కరోనా పరీక్షలు నిర్వహించగా, 577 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 79 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 66 కేసులు గుర్తించారు. అనేక జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య రెండంకెలకు లోపే నమోదైంది. అదే సమయంలో 645 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,48,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,35,895 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,674 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,819కి చేరింది.