Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐదు రోజులు గడుస్తున్నా దొరకని అంతయ్య ఆచూకీ మాత్రం లభించలేదు. సాహెబ్ నగర్ నాలాలో గత మంగళవారం రాత్రి 10గంటలకు మ్యాన్ హోల్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ సిబ్బంది అంతయ్య, శివ నాలాలో పడిపోయారు. బుధవారం శివ మృతదేహాన్ని సిబ్బంది బయటకు తీశారు. అంతయ్య మృతదేహం కోసం అధికారులు గాలిస్తున్నారు. మూడు రోజులకు పైగా నాలా చెరువు వద్ద గాలింపు కొనసాగుతోంది. అసిస్టెంట్ ఇంజనీర్ గౌతమ్తో పాటు ఇద్దరు వర్క్ ఇన్స్ పెక్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు సస్పెండ్ చేశారు. డిప్యూటీ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతయ్య మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇతర రాష్టాల నుంచి అత్యాధునిక టెక్నాలజీని తీసుకొని గాలించాలని అధికారులు చూస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే అంతయ్య ఆచూకీ దొరకడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.