Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కేరళ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని పేయింగ్ గెస్టులుగా ఉంటున్న 21 మంది నర్సింగ్ విద్యార్థులకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వీరు కటిహల్లి పారిశ్రామిక వాడలోని నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. 21మంది విద్యార్థినులు కేరళ నుంచి వచ్చి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టులు సమర్పించారు.కరోనా సోకిన విద్యార్థినులను క్వారంటైన్ చేశారు. కరోనా సోకిన నర్సింగ్ విద్యార్థినులను కలిసిన వారందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.