Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాకుళం: పొందూరు చేనేత సమస్యలపై సంబంధిత మంత్రితో చర్చిస్తానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పొందూరు చేనేత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బ్యాంక్లు అర్హులైన చేనేత కార్మికులకు ఆర్థిక సహకారం అందించాలన్నారు. ఖాదీకి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గత పదేళ్లలో ఖాదీ ఉత్పత్తులు 18వేల కోట్లకు పెరిగాయని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు.