Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఆ టీకాలను ఇవ్వవచ్చు అని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో భారత్ తన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పెంచేసింది. జాన్సన్ అండ్ జాన్సన్కు అత్యవసర వినియోగం కోసం ఆమోదం దక్కడంతో.. భారత్లో వినియోగించనున్న అయిదవ టీకా కానున్నది. యురోపియన్ యూనియన్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మన వద్ద ఉన్నట్లు మంత్రి తన ట్విట్టర్లో తెలిపారు. జాన్సన్ సింగిల్ డోసు రాకతో.. కోవిడ్పై పోరాటం మరింత బలోపతం అవుతుందని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం దక్కిన విషయం తెలిసిందే.