Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో బీజేపీ కార్పొరేటర్ల పంచాయతీ బయటపడింది. సరూర్నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ధర్నాకు దిగారు. జిల్లా బీజేపీ ఆఫీస్ ఎదుట అనుచరులతో కలిసి ఆమె బైఠాయించారు. సేవ్ సరూర్నగర్ డివిజన్ అంటూ శ్రీవాణి నినాదాలు చేశారు. ఇతర బీజేపీ కార్పొరేటర్లు తన డివిజన్లో జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.