Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముంబైలోని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు కలకలం రేగింది. అబితాబ్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. అంతేకాదు. ముంబైలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చి వేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు అలర్టయ్యారు. బాంబ్ స్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. అమితాబ్ ఇంటితో పాటు పలు రైల్వేస్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసుల సోదాలలో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. దీంతో వారు ఇది ఫేక్ కాల్ అని స్పష్టం చేశారు.