Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి బర్న్స్ .. కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇవాళ ఉదయం 25 పరుగులు వద్ద ఇంగ్లండ్ మూడవ రోజు ఆటను ప్రారంభించింది. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్లో.. క్రాలీ(6) కూడా కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే వరకు ఇంగ్లండ్ రెండు నష్టానికి 46 రన్స్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 278 రన్స్కు ఆలౌటైన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 183 రన్స్ చేసింది.