Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తిరుమల కనుమదారిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన యాత్రీకులు శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుగు పయనమయ్యారు. కొండపై నుంచి కిందకు దిగే సమయంలో 32వ మలుపు వద్ద కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొంది. వేగంగా ఢీకొట్టడంతో ముందు సీటులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వాహనం రహదారిపై అడ్డంగా ఉండటంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయమేర్పడింది.