Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సూపర్ షో కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జావెలిన్ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్లో నిలిచాడు. అథ్లెటిక్స్లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు. తొలి ప్రయత్నంలో అతను 87.03 మీటర్ల దూరం విసిరి టాప్లో నిలిచాడు. ఇక రెండో అటెంప్ట్లో అతను మరింత పదునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్లో 87.58 మీటర్ల దూరం విసిరి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. నిజానికి క్వాలిఫయింగ్ రౌండ్లో ఫస్ట్ త్రోతోనే అందరికీ షాకిచ్చాడు నీరజ్. అతని పర్సనల్ బెస్ట్ 88.07 మీటర్లు. దానికి తగినట్లే నీరజ్ టోక్యోలో తన ట్యాలెంట్ చూపించాడు. ముందు నుంచి ఫెవరేట్గా ఉన్న నీరజ్.. అనుకున్నట్లే ఇండియాకు ఓ స్వర్ణాన్ని అందించాడు.