Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలం లోని సిర్నపల్లి గ్రామంలో సిరికోండ మండలానికి చెందిన రైతులకు గ్రామ భారతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలోని పద్మాల రాజశేఖర్ వ్యవసాయ క్షేత్రంలో పకృతి సేద్యం పై అవగాహన కల్పించారు.పతకాలం నాటి వరి వంగడాలైన నవారా, కుజిపటాలియ, మైసుర్ మల్లికా మొదలైన వంగడాల పై రైతులకు వివరించారు.రసాయన ఎరువులను వాడుతు పోతే భవిష్యత్తులో భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ భారతి జిల్లా అధ్యక్షుడు రావుట్ల జనార్దన్, కోశాధికార రాజేశేఖర్, సిరికోండ రైతులు రవిందర్ నాయక్,గాదరి గంగారెడ్డి, రఘు తోపాటు తదితరులు పాల్గొన్నారు.