Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. తాజాగా శనివారం ఉత్తరాఖండ్లో ఓ హోటల్ బిల్డింగ్ భాగం ఒక్కసారిగా కూలింది. శిథిలాలు లోయలోకి జారి పడ్డాయి. జోషిమఠ్లోని ఝాడ్కుల సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక అధికారులు ఈ ఉదయమే హోటల్ను ఖాళీ చేయించారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కాగా, ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.